హైదరాబాద్, జనవరి 17 : దంపతులైన ఉద్యోగులు ఒకే చోట పనిచేసేలా చూస్తామని, అంత వరకు ఉద్యోగులంతా ఓపికపట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం 2022 డైరీని సోమవారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, వొడితెల సతీశ్బాబుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. భార్యాభర్తలైన ఉద్యోగులు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే మానసిక ఒత్తిడితో సరిగ్గా పనిచేయలేరని, దీనిని త్వరలోనే పరిష్కరిస్తామని వినోద్ హామీఇచ్చారు. కార్యక్రమంలో సంఘం గౌరవ చైర్మన్ పద్మాచారి, చీఫ్ అడ్వయిజర్ పీ పవన్కుమార్గౌడ్, అధ్యక్షుడు మఠం రవీంద్రకుమార్, ప్రధాన కార్యదర్శి సీ హరీశ్కుమార్రెడ్డి, నాయకులు శ్రీనివాస్, శ్రీకాంత్రావు, డాక్టర్ శంకర్ భుక్యా, వేముల సురేందర్, భిక్షంనాయక్, గంగవరపు పద్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.