హైదరాబాద్: భూమిపై 33 శాతం పచ్చదనం ఉంటెనే వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. పచ్చదనం పెంచడానికి జరుగుతున్న అతిపెద్ద మానవ మహా ప్రయత్నం తెలంగాణకు హరితహారం. హరితహారం కార్యక్రమంలో భాగంగా అవకాశం ఉన్న ప్రతిచోట మొక్కలు నాటి పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి హరీశ్ తెలిపారు.
పచ్చదనం పెంచేందుకు జరుగుతున్న అతిపెద్ద మానవ ప్రయత్నం తెలంగాణకు హరితహారం కార్యక్రమమని ఆయన చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్ను మంత్రి హరీశ్ రావు ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హరితహారం కార్యక్రమానికి రూ.932 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
కాగా, హరితహారం కార్యక్రమంలో భాగంగా 2015 నుంచి 2022 వరకు మొత్తం 243 కోట్ల మెక్కలను నాటినట్లు మంత్రి వెల్లడించారు. అందుకోసం ఇప్పటివరకు రూ.8511 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.