హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,75,891 కోట్లతో మంత్రి భట్టువిక్రమార్క (Minister Bhatti Vikramarka) బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో విద్యా రంగానికి రూ.21,389 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను ప్రోహించేందుకుగాను మౌలిక సదుపాయాల కల్పనకు రూ.500 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించారు.
రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలన్న ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. విద్యార్థులకు స్కాలర్షిప్లను సకాలంలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సాంకేతిక విద్యను మరింత పటిష్ఠంగా, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సమాయత్తం చేడయానికి రాష్ట్రంలోని 65 ఐటీఐలను ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంలో స్కిల్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుపై ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు.