హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలంగాణకు రూ.1533.64 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. దేశంలోని 28 రాష్ర్టాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు పన్నుల్లో వాటా కింద రూ.72961.21 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.
పండుగను దృష్టిలో పెట్టుకుని నిధులు పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నది. ఈ విడత జనవరి 10న తన వాటాను విడుదల చేస్తారు. ఏపీకి రూ.2952.74 కోట్లు, కర్ణాటకకు 2660.88 కోట్లు, కేరళకు 1404.50 కోట్లు, తమిళనాడుకు 2976.10 కోట్లు దక్షిణాది 5 రాష్ర్టాలకు 11,527.86 కోట్లు విడుదల చేసింది.