Bharat Ratna: భారత దేశపు మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహరావును భారతరత్న వరించడం యావత్ తెలంగాణ గర్వించదగ్గ విషయమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తన X (ఎక్స్) ఖాతాలో పేర్కొన్నారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, బహుభాషా కోవిదుడని, తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి అని ఆయన కొనియాడారు.
స్వరాష్ట్రంలో పీవీకి బీఆర్ఎస్ ప్రభుత్వం సముచిత గౌరవాన్నిచ్చిందని, ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించిందని, ఏడాదిపాటు పీవీ శత జయంతి ఉత్సవాలను నిర్వహించిందని హరీశ్రావు గుర్తుచేశారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని మొదటిసారి డిమాండ్ చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని ఆయన పేర్కొన్నారు.
పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా పీవీని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ‘తెలంగాణ ముద్దు బిడ్డ’ అని కొనియాడారని హరీశ్రావు గుర్తుచేశారు. బీఆర్ఎస్ డిమాండ్ను గౌరవించి పీవీకి భారతరత్న ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహరావు గారికి భారతరత్న వరించడం యావత్ తెలంగాణ గర్వించదగ్గ విషయం. బహుముఖ ప్రజ్ఞాశాలి.. బహుభాషాకోవిదుడు.. తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి పీవీ.
స్వరాష్ట్రంలో పీవీకి బీఆర్ఎస్ ప్రభుత్వం సముచిత గౌరవాన్నిచ్చింది. ఆయన జయంతి, వర్ధంతి… pic.twitter.com/aT6NOXxuRd
— Harish Rao Thanneeru (@BRSHarish) February 9, 2024