హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన లో తెలంగాణ అటవీ శాఖ స్టాల్కు ప్రథమ బహుమతి దక్కింది. అటవీశాఖ గత ఏడేండ్లుగా అమలు చేస్తున్న పర్యావరణ హిత కార్యక్రమాలను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రదర్శించింది. పచ్చదనం పెంపు, జంతు సంరక్షణ చర్యల నమూనాలు ఈ ప్రదర్శనలో ఆకర్షణీయంగా నిలిచాయి.
అడవి థీమ్తో ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారం, మినీ జూ సందర్శకులను ఆకట్టుకున్నాయి. శుక్రవారం ముగింపు కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధుల చేతుల మీదుగా అటవీశాఖ అధికారులు బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు, సిబ్బందిని పీసీసీఎఫ్, హెచ్వోఎఫ్ఎఫ్ ఆర్ ఎం డోబ్రియల్ అభినందించారు.