నల్లగొండ : తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తన సొంతూరిపై మరోసారి ప్రేమను చాటుకున్నారు. అయ్యప్ప స్వామి సన్నిధానం స్థలం కొనుగోలుకు రూ. 2 లక్షల విరాళం అందించారు. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని వెలుగుపల్లిలో రాజీవ్ సాగర్ బుధవారం పర్యటించారు.
ఈ సందర్భంగా రాజీవ్ సాగర్ మాట్లాడుతూ.. కన్న తల్లిని, పుట్టిన ఊరును ఎన్నటికీ మరవకూడదని తెలిపారు. అందుకే తన స్వగ్రామానికి తోచిన సాయాన్ని చేస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్లో కూడా గ్రామానికి మరింత సేవ చేసే భాగ్యం ఇవ్వాలని ఆ భగవంతున్ని కోరుతున్నట్లు తెలిపారు. నూతనంగా నిర్మించనున్న అయ్యప్ప స్వామి సన్నిధానం కోసం 200 గజాల స్థలం కొనుగోలుకు రూ. 2 లక్షలను విరాళంగా అందజేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప సన్నిధానం కమిటీ అధ్యక్షులు గుండా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కొమరబోయిన నారాయణ, ప్రధాన కార్యదర్శి గుడిపాటి శ్రీహరి, కార్యదర్శి చుంచు శ్రీధర్, కోశాధికారి నరాల సురేష్ రెడ్డి పాల్గొన్నారు.