హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి ఉద్యమం చేస్తారనే భయంతోనే కేంద్ర ఈడీని ప్రయోగిస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్సాగర్ విమర్శించారు. మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత చేస్తున్న డిమాండ్ను ఓర్వలేక ఆమెకు ఈడీ నోటీసులు ఇచ్చారని దుయ్యబట్టారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరేమిటో చెప్పాలని, ఆ తర్వాతే ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్గాంధీ తెలంగాణలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు.