యాదాద్రి, ఆగస్టు 25 : యాదగిరిగుట్ట ఆలయాన్ని సీఎం కేసీఆర్ మహాద్భుతంగా తీర్చిదిద్ది ప్రజలకు అందించారని ప్రజాగాయకుడు గద్దర్ కొనియాడారు. అంతటి మహాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. గురువారం ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటైతే నర్సింహస్వామి వారికి అద్భుతంగా పూజలు చేస్తామని మొక్కుకొన్నామని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రజలు బ్రహ్మాండంగా పూజలు చేస్తున్నారని తెలిపారు. శిల్ప కళతో నిర్మించిన ఆలయాన్ని చూస్తుంటే మరో ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుందన్నారు.