హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): అగ్నిప్రమాదాలు, ప్రకృతి విపత్తులపై 106 ప్రాంతాల్లో విద్యార్థులకు తెలంగాణ అగ్నిమాపకశాఖ అవగాహన కల్పించింది.
ఈ నెల 18 నుంచి 24 వరకు విద్యాలయాలు, మల్టీఫ్లెక్స్ మాల్స్, సినిమా, ఫంక్షన్ హాళ్లు, దవాఖానలు, పెట్రోల్ బంకులు, నివాస, వాణిజ్య సముదాయాలు, బహిరంగ ప్రదేశాల్లో మాక్డ్రిల్స్ చేపట్టారు. వర్షాకాల ప్రత్యేక రెస్క్యూ బృందాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రాక్టీస్ ప్రారంభించాయి.