హైదరాబాద్ : తమను విధుల్లో చేరాలని ఆదేశించిన సీఎం కేసీఆర్కు ఫీల్డ్ అసిసెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఫీల్డ్ అసిస్టెంట్లు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవితను కలిసి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయంతో 7,000 మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లకు లబ్ది చేకూరిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఇంచార్జ్ రూప్ సింగ్, టీఆర్ఎస్ కేవి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, టీఎస్ ఫుడ్స్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.