రైతును రాజును చేసేవి సీఎం కేసీఆర్ ఆలోచనలు
రైతు బతకాలంటే కేంద్రంలో బీజేపీ గద్దె దిగాల్సిందే
పలు రాష్ర్టాల రైతు సంఘాల నేతల స్పష్టీకరణ
హైదరాబాద్, ఫిబ్రవరి 16 : తెలంగాణలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరమున్నదని పలు రాష్ర్టాల రైతు సం ఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం జాతీయస్థాయిలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్టు తెలిపారు. హరితప్లాజాలో బుధవారం 10 రాష్ర్టాలకు చెం దిన రైతు సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి.. తెలంగాణలో అమలవుతున్న పథకాలపై చర్చించారు. సమావేశానికి హాజరైన రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర సంక్షేమ పథకాల అమలు, వాటి వెనుక గల ఉద్దేశాలను వివరించారు. ఆయా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలన్నీ రైతును రాజును చేసే విధంగా ఉన్నాయన్నారు. వ్యవసాయరంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. దేశంలో రైతులు బతకాలం టే కేంద్రంలో బీజేపీ సర్కారు గద్దె దిగాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి సీఎం కేసీఆర్ నాయక త్వం అవసరమన్నారు. సమావేశంలో జాతీయ పసుపు రైతు ల సంఘం ఉపాధ్యక్షుడు నర్సింహనాయుడు, జాతీయ రైతు సంఘం నాయకుడు, బీఆర్ పాటిల్, రాజారాం, రామ గౌండర్, జోసెఫ్ జాన్, సుమంత్ పాండే పాల్గొన్నారు.