హైదరాబాద్, అక్టోబర్16 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులకు సంబంధించి డిజైన్లను సమకూర్చేందుకు ప్రత్యేక కన్సల్టెన్సీ నియమించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కన్సల్టెన్సీల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈవోఐ)ని స్వీకరించే అంశాలపై ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు.
ఆ గడువు 15వ తేదీతో ముగియగా, 25వ తేదీ వరకు పొడిగించాలని ఇరిగేషన్శాఖ నిర్ణయించింది. ఈవోఐకి సంబంధించి ఆసక్తి ఉన్న కన్సల్టెన్సీలతో ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులు ఇటీవల ప్రీబిడ్ సమావేశం నిర్వ హించగా, నాలుగు కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈవోఐ దాఖలుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు సరిపోదని, గడువును పొడిగించాలని కోరగా ఈ నిర్ణయం తీసుకున్నది.