హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మరో లేఖ రాశారు. రాజోలిబండ హెడ్ వర్క్స్ను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణ పనుల పూర్తికి చర్యలు చేపట్టాలని కోరింది. పనులు చేపట్టకుండా కర్ణాటకను ఆంధ్రప్రభుత్వం అడ్డుకుంటోందని తెలంగాణ పేర్కొన్నది. శాంతిభద్రతల పేరిట పనులను ఏపీ అడ్డుకుంటోందని తెలిపింది. ఆర్డీఎస్ ఆనకట్టను ఆధునీకరించకపోవడం వల్ల మూడో వంతు నీరు రావట్లేదని తెలంగాణ కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లింది. కేసీ కెనాల్ ద్వారా అదనపు జలాలు మళ్లించేందుకు ఏపీ యత్నిస్తుంది అని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తన లేఖలో పేర్కొన్నారు.