CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు గౌరవ ప్రదమైన వేతన సవరణ చేసినందుకు గాను విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరపున ఆ సంఘం నాయకులు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావును ఆయన కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అంజయ్య మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగులకు గౌరవ ప్రదమైన వేతన సవరణ చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే, విద్యుత్ సంస్థల పరిరక్షణకై విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యోగుల పోరాటానికి బాసటగా నిలిచి, విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసి పంపి విద్యుత్ రంగాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సీఎండీ శ్రీ ప్రభాకర్ రావును కలిసిన వారిలో VAOAT సంఘం ప్రధాన కార్యదర్శి అంజయ్యతో పాటు సంఘం అధ్యక్షులు అశోక్, షరీఫ్, కొరడాల వెంకటేశ్వర్లు, మహేందర్, శ్రీనివాస్ మహిళ కార్యదర్శి అనురాధ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.