హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ)ను మే రెండో వారంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. బుధవారం సచివాలయంలో ఎంసెట్ సహా పలు వృత్తివిద్యాకోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ పిన్సిపల్ సెక్రటరీ బుర్రాం వెంకటేశం సమీక్షించగా, ఈ మేరకు ఉన్నత విద్యామండలి అధికారులు అభిప్రాయపడ్డారు.
ఎంసెట్ నిర్వహణకు ఎలాంటి పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్న అంశంపైనా బుర్రా వెంకటేశం అధికారులను ఆరా తీశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సాధ్యమయ్యే తేదీలపైనా చర్చించారు. జేఈఈ, నీట్ వంటి ఇతర పరీక్షల తేదీలు విడుదలకావడంతో ఆయా తేదీలను మినహాయించి ఎంసెట్తోపాటు, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్సెట్, లాసెట్, పీఈసెట్, ఈసెట్ వంటి పరీక్షల షెడ్యూళ్లను విడుదల చేయనున్నారు.