హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అటవీశాఖ అధికారులు నిర్భయంగా విధుల్లో పాల్గొనేలా వారిలో భరోసా కల్పించాలని పోలీస్ అధికారులను డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అటవీశాఖ అధికారులు, సిబ్బందికి మద్దతుగా నిలవాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం ఎఫ్ఆర్వో శ్రీనివాస్రావు హత్య నేపథ్యంలో డీజీపీ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) ఆర్ఎం డోబ్రియల్తో కలిసి పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
భద్రాద్రికొత్తగూడెం వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. తమ పరిధిలోని చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యలను పరిషరించాలని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు సైతం వారి పరిధిలోని అటవీసిబ్బంది, అధికారులతో సమావేశమవ్వాలని, రక్షణ, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.