DGP Anjani Kumar | హైదరాబాద్ : హైదరాబాద్లో నిన్న సాయంత్రం గుండెపోటుతో మృతి చెందిన
ప్రముఖ ఉర్దూ దినపత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దిన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను డీజీపీ అంజనీ కుమార్ మంగళవారం ఉదయం లక్డీకాపూల్లో ఉన్న వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
జహీరుద్దిన్ అలీఖాన్ అన్న జహెద్ అలీఖాన్, కుమారుడు అమీర్ అలీ ఖాన్లను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జహీరుద్దీన్ అలీఖాన్ అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. జర్నలిజానికి, ఉర్దూ పత్రిక రంగానికి ఎనలేని సేవలు చేశారని, నగరంలో మతసామరస్యానికి వారు చేసిన కృషిని ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ గుర్తు చేసుకున్నారు.