హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు 112 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఉద్యోగాల్లో నుంచి తొలిగించాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. వీరు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దీర్ఘకాలికంగా విధులకు దూరంగా ఉంటున్నట్టు ప్రభుత్వం గుర్తించింది.
వారి గైర్హాజరు కారణంగా అటు వైద్యవిద్యార్థులకు తరగతులు జరగకపోగా, ఇటు అనుబంధ దవాఖానల్లో వైద్యసేవలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. మరోవైపు ప్రొఫెసర్ల హాజరు తక్కువగా నమోదవడం, అనుబంధ దవాఖానల్లో ఓపీ తక్కువగా నమోదవుతుండటంతో ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఇబ్బంది ఎదురవుతున్నది. ఈ నేపథ్యంలో గుదిబండగా మారినవారిని సర్వీస్ నుంచి తొలగించాలని వైద్యశాఖ నిర్ణయించినట్టు సమాచారం.