న్యూస్ నెట్వర్క్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని మొ క్కలు నాటారు. అసెంబ్లీ ప్రాంగణంలో మం డలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, అసెం బ్లీ కార్యదర్శి వీ నరసింహాచార్యులుతో కలిసి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మొక్కలు నాటారు. హైదరాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలోని నెహ్రూ పార్కు లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మొక్క లు నాటారు.
అనంతరం పద్మారావునగర్లోని చిదానం దం కాలనీలో నూతనంగా నిర్మించిన తెలంగాణ దశాబ్ది పార్కును, వెంకట్రావునగర్ పార్క్లను ప్రారంభించారు. కరీంనగర్లోని హౌసింగ్బోర్డ్ కాలనీతోపాటు పద్మానగర్లో మేయర్ సునీల్రావుతో కలిసి బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ మొక్కలు నాటారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మొ క్కను నాటారు. తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో సోమవారం టీఎస్ఫుడ్స్ చైర్మ న్ మేడె రాజీవ్సాగర్, పోలీస్ హౌసింగ్ కా ర్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్ మొక్కలు నాటారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య మొక్కలు నాటారు.
పచ్చదనంపై ప్రజల్లో చైతన్యం పెరిగింది: ఎంపీ సంతోష్
గ్రీన్ ఇండియా చాలెంజ్తో ప్రజల్లో పచ్చదనంపై చైతన్యం పెరిగిందని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం హరితహారంస్ఫూర్తితో పచ్చదనంతో నిండిపోయిందని తెలిపారు. హరిత దినోత్సవం సందర్భంగా ఉప్పల్ భగాయత్లో సోమవారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డితో కలిసి ఆయన మొక్కలు నాటారు. తెలంగాణవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన పెరిగిందని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటడం, సంరక్షించడం చేస్తున్నారని ఎంపీ సంతోష్ చెప్పారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన హరితహారంతో ప్రతి ప్రాంతం హరితమయంగా మారిపోయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు కిశోర్గౌడ్, కరుణాకర్రెడ్డి, రాఘవ, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, స్వర్ణరాజ్ తదితరులు పాల్గొన్నారు.