దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ప్రకృతి ప్రకాశ్ కూతురు, ప్రకృతి ప్రేమికురాలు చిన్నారి బ్లెస్సీ తాను సేకరించిన లక్షా పదివేల సీతాఫల్ గింజలతో సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపింది. హరితోత్సవం సందర్భంగా సోమవారం తన ఇంటివద్ద ‘బంగారు తెలంగాణ-దశాబ్ది పండుగ’ అంటూ అక్షర ఆకృతిలో గింజలను పేర్చి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపింది.
– కోనరావుపేట