తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) యొక్క తొమ్మిదో వార్షిక సర్వ సభ్య సమావేశం నవంబర్ 27 వ తేదీన స్థానిక ఆర్య సమాజ్ లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో సొసైటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఎనిమిదొవ సర్వసభ్య సమావేశపు వివరాల తో పాటు 2021-2022 ఆర్థిక సంవత్సరపు రాబడి మరియు ఖర్చుల పట్టిక కను సభ్యులకు వివరించిన తరువాత ఆమోదం పొందడం జరిగింది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లు గా సేవలందించిన కిరణ్ కుమార్ ఎర్రబోయిన మరియు శివ రెడ్డి అద్దుల గార్లకు కృతజ్ణతలు తెలియజేసారు. ఈ సంవత్సరం నూతన అధ్యక్షుడు గా గడప రమేశ్ బాబు మరియు ఆయన కార్యవర్గాన్ని గారి ని ఏకగ్రీవంగా ప్రతి పాదించడం తో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుండి నామినేషన్ రావడం తో ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారులు పెద్దపల్లి వినయ్ కుమార్ ప్రకటించారు.
ఈ సారి ఎన్నికల అధికారిగా వ్యవహరించిన వినయ్ కుమార్ మరియు ముద్రకోల నవీన్ గారికి సొసైటీ సభ్యులు కృతజ్ణతలు తెలియజేశారు. తన పై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించి ఇక్కడి తెలంగాణ వాసులకు సేవ చేసే అవకాశం ఇస్తుంన్నందుకు గడప రమేష్ గారు అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
నూతన కార్యవర్గం సహకారం తో సొసైటీ ని మరింత అభివృద్ధి చేయడానికి శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు మరియు ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా సహాయ సహకారాలు అందిస్తున్న కార్య మరియు కార్య నిర్వాహక వర్గ సభ్యులందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. దీనితో పాటు 2022-2023 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లు గా మద్దికుంట్ల రాజు మరియు శేఖర్ రెడ్డి ఓరుగంటి గార్లను ప్రకటించి ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షులు నీలం మహేందర్ మాట్లాడుతు సొసైటీ చేసిన కార్యక్రమాలను వివరించారు. మరియు సొసైటీ సంస్థాగత అధ్యక్షులు బండా మాధవ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్నో విలువైన సలహాలు ఇవ్వడం జరిగింది. సొసైటీ కి ఇంతకాలం సేవలందించిన నీలం మహేందర్, గర్రెపల్లి శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్ చెన్నోజ్వల, గార్లపాటి లక్ష్మారెడ్డి, కొల్లూరి శ్రీధర్, గింజల సురేందర్ రెడ్డి మరియు వినయ్ కుమార్ పెద్దపల్లి గార్లకు జ్ఞాపిక అందజేశారు.
నూతన కార్య వర్గం మరియు కార్యనిర్వాహక వర్గం లో అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు, నల్ల భాస్కర్ గుప్త, గోనె నరేందర్ రెడ్డి, , మిర్యాల సునీత రెడ్డి, దుర్గ ప్రసాద్ మంగలి ప్రాంతీయ కార్యదర్శులు, నంగునూరి వెంకట రమణ, బొండుగుల రాము, నడికట్ల భాస్కర్ మరియు రవి కృష్ణ విజ్జాపూర్, మరియు కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, బొడ్ల రోజా రమణి , శివ ప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, రాధికా రెడ్డి, సదానందం అందె, రవి చైతణ్య మైసా, మరియు విజయ మోహన్ వెంగళ మొదలగు వారు ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి మరియు సమావేశం సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.