హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం మెట్రో రైల్లో ప్రయాణించారు. ఖైరతాబాద్ నుంచి అమీర్పేట్ వరకు సీఎస్ ప్రయాణించి.. మెట్రోలో కరోనా జాగ్రత్తలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. మెట్రోలో కరోనా నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలపై సీఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్ వెంట మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి ఉన్నారు.