హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా సీఎస్ కంటి పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ల సూచన మేరకు సీఎస్ కళ్లద్దాలను తీసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం గొప్ప సామాజిక పథకం అన్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి పథకం అమలు కావడం లేదన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు తాత మధు, కౌశిక్ రెడ్డి కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు.