Telangana | హైదరాబాద్ : ఉగాది( Ugadi ) వేడుకల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి( CS Shanti Kumari ) గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి( Ramanachary ), అధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 22న రవీంద్ర భారతి( Ravindra Bharathi )లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. ఉగాది వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని కవి సమ్మేళనం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇందు కోసం సాంస్కృతి శాఖ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.