CS Shanti Kumari | హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై( Govt Jobs ) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి( CS Shanti Kumari )సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్( BRK Bhavan )లో నియామక బోర్డుల అధికారులతో శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. టీఎస్పీఎస్సీ( TSPSC ) భర్తీ చేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్( Asst Engineer ) ప్రశ్నాపత్రం లీకైందని తేలడంతో.. ఉద్యోగ నియామకాలపై సీఎస్ సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఈ సమీక్షా సమావేశానికి టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్( Anitha Ramachandran ), పోలీసు నియామక బోర్డు( TSLPRB ) చైర్మన్ శ్రీనివాస్ రావు, గురుకుల నియామక బోర్డు కార్యదర్శి మల్లయ్య భట్టు, వైద్య నియామక బోర్డు జేడీ గోపీకాంత్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, జీఏడీ ముఖ్య కార్యదర్శితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.
ఈ నెల 5వ తేదీన జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ రాతపరీక్ష ప్రశ్నాపత్రం లీకైందని సమాచారం అందడంతో.. టీఎస్పీఎస్సీ అధికారులు అప్రమత్తమైన సంగతి తెలిసిందే. ఈ నెల 12న జరగాల్సిన టీపీబీవో, 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాతపరీక్షలను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. ఏఈ పేపర్ లీక్ కేసులో టీఎస్పీఎస్సీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్రెడ్డిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్కుమార్ను సస్పెండ్ చేశారు. గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక, ఆమె భర్త డీఆర్డీఏలో టెక్నికల్ అసిస్టెంట్ ఢాక్య, కానిస్టేబుల్ శ్రీనివాస్ను రిమాండ్కు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురిపై నేడో, రేపో అధికారికంగా చర్యలు తీసుకోనున్నారు.