Nikhat Zareen | హైదరాబాద్ : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 50 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకొని రికార్డ్ సృష్టించిన నిఖత్ జరీన్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి( CS Shanti Kumari ), డీజీపీ అంజనీ కుమార్( DGP Anjani Kumar ) అభినందించారు. బీఆర్కే భవన్లో నిఖత్ జరీన్ను సీఎస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరీన్ను శాలువాతో సత్కరించారు.
నిఖత్ జరీన్ తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలిపిందని సీఎస్ ప్రశంసించారు. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ను ఒకటి కంటే ఎక్కువసార్లు గెలుచుకున్న రెండవ భారతీయ బాక్సర్గా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించిందని డీజీపీ కొనియాడారు. నేటి యువ క్రీడాకారులకు జరీన్ ఆదర్శవంతంగా నిలిచిందని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పాల్గొన్నారు.