Telangana | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్రావు( Harish Rao ) మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు అని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్( Banda Prakash ) పేర్కొన్నారు. ఏపీ మంత్రులు చిల్లరగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హరీశ్రావుకు ఉద్యమ నేపథ్యం ఉంది.. మీకు ఏమి ఉందని ఏపీ మంత్రులను ఉద్దేశించి ప్రశ్నించారు. హరీశ్రావుకు పాలనా అనుభవం ఉంది. ఏదీ మాట్లాడినా విషయం ఉంటుంది. చిల్లర వేషాలు మీవి.. చిల్లర చేష్టలు మీవి అని విమర్శించారు. హైదరాబాద్కు రావాల్సి ఉంటుందని మరిచిపోవద్దు.. పిచ్చి మాటలు మాట్లాడితే ఖబడ్దార్ అని బండా ప్రకాశ్ హెచ్చరించారు.