Telangana | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 11.97% వృద్ధిరేటును నమోదు చేయడం ద్వారా రూ.3,08,732 కోట్ల జీఎస్డీపీతో అన్ని రాష్ర్టాల కంటే అగ్రస్థానంలో నిలిచింది.
ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల గత తొమ్మిదిన్నర ఏండ్లలో రాష్ట్రం వ్యవసాయ, మౌలిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించడం వల్లనే ఇది సాధ్యమైంది. ఈ జాబితాలో తెలంగాణ తర్వాత కర్ణాటక, హర్యానా, తమిళనాడు రాష్ర్టాలు ఉన్నాయి. ఏపీ కూడా టాప్-10లోనే ఉండటం విశేషం.