హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం ఎడాపెడా అప్పు లు చేసిందని, తాము అప్పులను కట్టడి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతున్నది. కానీ.. చేతలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నా యి. చేతికి అందిన కాడికి అప్పులు చేసేస్తున్నది. కేవలం మూడు నెలల కాలంలోనే బాం డ్ల విక్రయాల ద్వారా సుమారు రూ.6400 కోట్ల అప్పులు చేసింది. అంతకుముందు బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పులతో పోలిస్తే ఇది ఎంతో ఎక్కువ.
బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ బీఆర్ఎస్ కంటే ఎక్కువగా రుణాలు సేకరిస్తామని ప్రతిపాదించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఓపెన్ మార్కెట్ ద్వారా రుణాలు రూ. 40,150 కోట్లు వస్తాయని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అంచనా వేసింది. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24లో రూ.40,615 కోట్లు వస్తుందని అంచనా వేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఎక్కువగా వస్తాయని ప్రతిపాదించింది. కానీ..ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఓపెన్ మార్కెట్ రుణాల రూపంలో రూ. 59,625 కోట్లు వస్తాయని తెలిపింది. అంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే రూ.19,010 కోట్లు ఎక్కువ వస్తాయని పేర్కొన్నది. ఒకేసారి అంత భారీగా రుణాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా సేకరిస్తారు? అన్న దానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు.