హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారు.
సోమవారం సాయం త్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్లారు. ఎయిర్పోర్టులో వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం శ్రీవారి తోమాల, సుప్రభాత సేవలో పాల్గొంటారు.