హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ప్రాథమ్యాలు గుర్తెరిగి పనిచేయాలని.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేర్చటంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సూచించారు. 2020 బ్యాచ్కు చెందిన ఏడుగురు తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారులకు ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు)గా పోస్టింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఎస్ వారినుద్దేశించి మాట్లాడుతూ విధి నిర్వహణలో అలసత్వం లేకుండా ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో ఎంసీహెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ మహేశ్దత్ ఎక్కా, సీనియర్ ఐఏఎస్లు అర్వింద్కుమార్, సందీప్కుమార్ సుల్తానియా, శేషాద్రి, రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు.