హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ.1,865 కోట్లు కేటాయించింది. రోడ్లు భవనాలశాఖలో కొత్తగా 472 ఉద్యోగాలు మంజూరు చేసింది. పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టాలని రోడ్లు భవనాలశాఖను ఆదేశించింది. సత్వరమేశాఖలో పదోన్నతులు పూర్తిచేయాలని సూచించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ప్రగతిభవన్లో నిర్వహించారు. సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖకు పూర్తిగా కొత్తరూపునిచ్చే నిర్ణయాలు తీసుకొన్నారు. వ్యవసాయంతోపాటు పలురంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి కారణంగా ఈ శాఖలో పని విసృ్తతి పెరుగుతున్నదని, అనుగుణంగా శాఖలో పలువిభాగాలను పటిష్ఠం చేయాలని క్యాబినెట్ అభిప్రాయపడింది. ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరచాలని నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే తీసుకొన్న పలు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. శాఖలో అధికార వికేంద్రీకరణకు అవసరమైన అదనపు ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, నూతన కార్యాలయాలను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించింది. ఇందుకోసం అదనపు నిధులను కూడా మంజూరుచేసింది. అత్యవసర సమయాల్లో అధికారులు స్వీయనిర్ణయంతో ప్రజా అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు అవకాశమిచ్చింది.
ఆర్ అండ్ బీ పరిధిలోని రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు క్యాబినెట్ రూ.1,865 కోట్ల అదనపు నిధులు కేటాయించింది. ఈ నిధులను కాలానుగుణంగా చేపట్టే రోడ్ల మరమ్మతు(పీరియాడిక్ రెన్యువల్స్)ల కోసం మంజూరుచేసింది. వానలు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాల సమయంలో రోడ్లు తెగిపోవడం, కొట్టుకుపోవడం వంటి సందర్భాల్లో ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచే దిశగా తక్షణమే పనులు చేపట్టేందుకు మరో రూ.635 కోట్లు కేటాయించింది. పెరిగిన నూతన ఉద్యోగాలతోపాటు, శాఖలో పరిపాలన వికేంద్రీకరణకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా నూతన కార్యాలయాల నిర్మాణం, మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రోడ్లు, భవనాలు, ఎలక్ట్రికల్, జాతీయ రహదారుల విభాగాల్లో 3 చీఫ్ ఇంజినీర్, 10 సరిల్, 13 డివిజన్, 79 సబ్ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ శాఖను ఆదేశించింది.
వానలు, వరదలు తదితర ప్రకృతి విపత్తుల సమయంలో అత్యవసర చర్య లు చేపట్టేందుకు అధికారులకు క్యాబినెట్ స్వీయ నిర్ణయాధికారాన్ని ఇచ్చింది. యు ద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు వీలుగా కిందిస్థాయి డీఈఈ నుంచి పైస్థా యి సీఈ వరకు స్వతంత్ర నిర్ణయాధికారానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.