హనుమకొండ చౌరస్తా/సుల్తాన్బజార్, అక్టోబర్ 4: సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని తెలంగాణ బ్రాహ్మణ సం ఘాలు, అర్చక సంఘాలు స్వాగతిస్తున్నాయని అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. మంగళవారం ఆయన హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ వల్ల దేశంలోని సబ్బండ వర్ణాలకు న్యాయం జరుగుతుందన్నారు. అనేక రాజకీయ సంక్షోభాల నుంచి రాష్ర్టాన్ని కాపాడుతూ సుస్థిరమైన పరిపాలన అందిస్తున్న కేసీఆర్కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 లక్షల మంది బ్రాహ్మణులు, అర్చకుల ఆశీర్వాదాలు అందజేస్తున్నామని తెలిపారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు గంగు ఉపేంద్రశర్మతోపాటు బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర కన్వీనర్ పెండెం రాఘవరావు, వైష్ణవ సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడిమెల్ల విజయకుమారాచార్యులు, అర్చక, ఉ ద్యోగ జాక్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శివపు రం రామలింగారాధ్య మద్దతు, హర్షం ప్రకటించారు.