హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నెరవేరని కాంగ్రెస్ గ్యారెంటీలపై నిలదీసేందుకు, తెలంగాణ ప్రజల గోడు వినిపించేందుకు లోకసభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తో తమకు అత్యవసరంగా అపాయింట్మెంట్ ఇప్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు సీఎం రేవంత్ను కోరారు. ఆయన సీఎంకు బహిరంగ లేఖ రాశారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటుతు న్నా ఆరు గ్యారెంటీలు, హామీ ల అమల్లో దారుణంగా విఫలమైందని విమర్శించారు. అపాయింట్మెంట్ ఇప్పించడంలో వి ఫలమైతే ప్రజలకు కాంగ్రెస్ చేసిన మహాద్రోహంగా నిర్ధారణ అవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాహుల్, సోనియా, ప్రియాంక రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, స్వయంగా ఇచ్చిన గ్యారెంటీలను నమ్మి ఓటర్లు కాంగ్రెస్ను గెలిపించారని తెలిపారు.