Bandi Sanjay | పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు హనుమకొండ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. రూ. 20వేలతో పాటు ఇద్దరి పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘ వాదనల తర్వాత బండి సంజయ్కు బెయిల్ మంజూరైంది.
పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్కు హనుమకొండ కోర్టు బుధవారం నాడు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బండి సంజయ్తో పాటు మిగతా ముగ్గురు నిందితులను కరీంనగర్ జైలుకు తరలించారు. ప్రస్తుతం బండి సంజయ్ అక్కడే ఉన్నారు.