హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ జారీ అయింది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. అయితే గత సమావేశాల కొనసాగింపుగానే నోటిఫికేషన్ జారీ అయింది.