హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తేతెలంగాణ) : ఈ నెల 17న సెలవు నేపథ్యంలో తెలంగాణ శాసనసభ శుక్రవారం ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశం కానున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రకటించారు. బుధవారం సభలో సెక్షన్ 22-ఏ అంశంపై సీఎం రేవంత్రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు.
సెప్టెంబర్ 9న జరిగిన సభలో ఆందోళన, నినాదాలతో వెల్లోకి వెళ్లిన 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.18న వివిధ కీలకాంశాలపై చర్చ కొనసాగే అవకాశం ఉన్నది.