Telangana | హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఎగ్జిట్ పోల్స్లో కూడా స్పష్టత రాకపోవడంతో ఈ ఫీవర్ ఏపీ, కర్ణాటకకు సైతం తాకింది. దీంతో బెట్టింగ్ జోరందుకున్నది. నియోజకవర్గాలు, అభ్యర్థుల వారీగా భారీగా పందేలు కాస్తున్నట్టు తెలుస్తున్నది. చాలామంది బీఆర్ఎస్ గెలుపు, కేసీఆర్ వ్యూహరచనపై నమ్మకం పెట్టుకున్నట్టు సమాచారం. ఒక్కో బెట్టింగ్ రూ.10 లక్షలు మొదలుకొని కోటికి పైగా నడుస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ముఖ్యంగా ఏపీకి చెందిన కొందరు పందెం రాయుళ్లు భారీస్థాయిలో బెట్టింగ్కు పాల్పడుతున్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలో సైతం బెట్టింగ్ ఊపందుకున్నది. నియోజకవర్గ అభ్యర్థిపై బెట్టింగ్తో పాటు కచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బెట్టింగ్లకు దిగుతున్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే అంశంపై జోరుగా బెట్టింగ్లు నడుస్తున్నట్టు సమాచారం. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.