Telangana Assembly | హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు అప్పగించవద్దని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ఉదయం సభలో ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానంపై పలువురు సభ్యులు ప్రసంగించారు. తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు సభ్యులు ప్రసంగించిన అనంతరం తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను ఫిబ్రవరి 13(మంగళవారం)కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు సభ తిరిగి ప్రారంభం కానుంది.