హైదరాబాద్ : కరోనా సమయంలో కొందరు మానవత్వాన్ని మరిచి ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు. కరోనా మందులతోపాటు ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ చేసి విక్రయిస్తూ బాధితులకు తీరని అన్యాయం చేస్తున్నారు.
నగరంలోని మల్లేపల్లి ప్రాంతంలో ఆక్సిజన్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.
రవికాంత్, చంద్రకాంత్ అనే ఇద్దరు ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు.
నిందితుల నుంచి 57 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు యూనైటెడ్ గ్యాస్ ఏజెన్సీ పేరుతో ఆక్సిజన్ సిలిండర్ల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.