వనపర్తి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరెంట్ కష్టాల నుంచి.. మిగులు కరెంటును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
మంగళవారం వనపర్తిలో రైతులకు ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో గత మూడేళ్లుగా రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తుందని, అలాగే విద్యుత్ సమస్యలు లేని ప్రాంతంగా తెలంగాణ వెలుగొందుతుంని పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు అడిగిన వెంటనే విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.
అలాగే రూ.50 వేల కోట్లతో రైతుబంధు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఇప్పటివరకు రైతుల ఖాతాలలో ఆరు వేల కోట్లు పడ్డాయని తెలిపారు.