ఖైరతాబాద్, సెప్టెంబర్ 18 : చదువుల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్ధులను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేశారు. లక్డీకాపూల్లోని వాసవి కల్యాణమండపంలో ఆదివారం ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రారంభించారు.
ఉత్తమ విద్యార్థులకు మండలి చైర్మన్ గుత్తా, రాష్ట్ర ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, మహాసభ మహిళా అధ్యక్షురాలు శారద ప్రతిభా పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో సంఘం నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.