హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే అత్యంత ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని పరిశ్రమల శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
రాష్ట్రంలో చేపడుతున్న కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై సీఎస్ శుక్రవారం సచివాలయంలో పరిశ్రమలు, వాణిజ్యశాఖ సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్తోపాటు ఇతర వ్యూహాత్మక పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు.