ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ పురోగమిస్తుందని గవర్నర్ తమిళిసై కితాబునివ్వడం గర్వం గా ఉన్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి.. విప్ గువ్వల బాలరాజు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచారు. వ్యవసాయాన్ని రాష్ట్రంలో పండుగచేసిన ఘనత సీ ఎం కేసీఆర్దేనని పేర్కొన్నారు. వలసపోయి న రైతన్నలు మళ్లీ ఊర్లకు తిరిగివచ్చి ధైర్యంగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నారంటే.. వారికోసం టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన రైతుబంధు, రైతుబీమా వంటి అనేక పథకాలే కారణమని చెప్పారు. మిషన్ భగీరథ కారణంగా నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడ విరగడ అయిందన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అక్కడికక్కడే అయ్యేలా రెవెన్యూ చట్టం తేవడం వల్ల ప్రజల్లో ధైర్యం పెరిగిందని అన్నారు. గవర్నర్ ప్రసంగంపై ఎంఐఎం తరఫున ఎమ్మెల్యే పాషాఖాద్రి ధన్యవాదాలు తెలిపారు.