హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): పర్యాటకుల భూతల స్వర్గం తెలంగాణ అని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ప్రపంచ పటంలో తెలంగాణ పర్యాటకాన్ని సుస్థిరం చేసేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. లండన్లో వరల్డ్ ట్రా వెల్ మార్ట్ (డబ్ల్యూటీఎం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ స్టాల్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ ట్రావెల్ ఏజెంట్స్ (ఏబీటీఏ) ఆ ధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఇం డియా టూరిజం సెక్రటరీ అరవింద్సింగ్తో కలిసి పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మా ట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ సరికొత్త విధానాలతో, సంస్కరణలతో ప్రపంచస్థాయి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొం దిందని చెప్పారు.
కేసీఆర్ కృషితోనే రామప్పకు యునెస్కో గుర్తింపు, ప్రపంచ పర్యాటక గ్రామంగా పోచంపల్లికి గుర్తింపు దక్కిందని వివరించారు. కొవిడ్ తర్వాత ప్రస్తుతం విదేశీ పర్యాటకులు తెలంగాణను సందర్శిస్తున్నారని చెప్పారు. లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక ప్రదేశాలపై సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచామని తెలిపారు. అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ ట్రావెల్ ఏజెంట్స్ ప్రతినిధులు తెలంగాణ పర్యాటక అభివృద్ధిని ప్ర త్యక్షంగా వీక్షించాలని మంత్రి ఆహ్వానించారు. భారతదేశానికే తలమానికమైన కోహినూర్ వజ్రం గురించి లండన్ ప్రతినిధులతో చర్చించినట్టు శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పర్యాటకాభివృద్ధి శాఖ ఎండీ మనోహర్, పర్యాటకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహేశ్, అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ ట్రావెల్ ఏజెంట్స్ డైరెక్టర్ సుషాన్ ధీర్, ఆబ్టా హెడ్ ఆంజెలా హిల్స్ పాల్గొన్నారు.