వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఆదివారం ఒకే రోజు 32 కాన్పులు చేసినట్టు ప్రొఫెసర్, హెచ్వోడీ అరుణకుమారి తెలిపారు.
తల్లీబిడ్డలు అంతా క్షేమంగానే ఉన్నట్టు ఆమె పేర్కొన్నారు. గతంలోనూ వనపర్తి ఎంసీహెచ్వోలో 28 కాన్పులు చేసిన రికార్డు ఉన్నదని, ఇప్పుడు దాన్ని అధిగమించినట్టు చెప్పారు.