హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,447 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యిందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా 2,295 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి మరో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,197 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,11,656కు చేరాయి. ఇందులో 6,85,399 మంది కోలుకున్నారు. వైరస్తో ఇప్పటి వరకు 4,060 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం మరణాల రేటు 0.57శాతంగా ఉందని, రికవరీ 96.31శాతం ఉందని ఆరోగ్యశాఖ వివరించింది. ఇవాళ ఒకే రోజు 80,138 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్త కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ పరిధిలోనే 1112 కేసులు రికార్డయ్యాయి.