పాలకుర్తి: కాంగ్రెసోళ్లు ఈ దఫా రైతుబంధు వెయ్యొద్దని లొల్లివెట్టిండ్రని, అంతటితో ఆగక రైతుబంధు వేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుకోవాని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిండ్రని మంత్రి హరీశ్రావు విమర్శించారు. అంతేగాక కాంగ్రెస్ నేతలు రైతుబంధు దండుగ అన్నరని మంత్రి చెప్పారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి సీఎం కేసీఆర్ రైతుబంధు పేరుతో రైతులకు బిచ్చమేస్తున్నడని మాట్లాడిండని, రైతులను అవమానించిండని మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు.
శనివారం పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు మద్దతుగా మంత్రి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధును అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, కాళ్లల్ల కట్టెబెట్టినా ఇయ్యాల ఎన్నికల సంఘం నుంచి రైతులకు శుభవార్త వచ్చిందని ఆయన తెలిపారు. రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు వేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ చెప్పిందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసినా దేవుడు మన పక్షాన ఉన్నాడని, ధర్మమే గెలిచిందని వ్యాఖ్యానించారు.
ఇయ్యాల రెండో శనివారం, రేపు ఆదివారం కాబట్టి బ్యాంకులకు సెలవు ఉన్నదని, సోమవారం పొద్దున చాయితాగే టైమ్కల్లా రైతుబంధు నిధులు పడగానే మీ సెల్ ఫోన్లు టింగ్ టింగ్ మని మోగుతాయని మంత్రి హరీశ్రావు చెప్పారు.