తెలకపల్లి : నిందితులపై కేసు కాకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎస్ఐ(Sub inspector) వాసు రామ్ నాయక్, కానిస్టేబుల్ ఆంజనేయులుపై ఆదివారం సస్పెన్షన్(Suspension) వేటు పడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 26న నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి(Telakapalli ) మండల పరిధిలోని బొపెల్లి సమీపంలో కొందరు పేకాట ఆడుతుండగా విషయం తెలుసుకున్న పోలీసులు 6 మందిని పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. వారిపై కేసు కాకుండా ఉండడానికి ఎస్ఐ నిందితుల నుంచి డబ్బులు డిమాండు చేశాడు అన్న ఆరోపణపై ఎస్పీ వైభవ్ గైక్వాడ్విచారణకు ఆదేశించారు. విచారణలో డబ్బులు తీసుకున్నట్లు తేలడంతో ఎస్ఐ, కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు.